సివిల్స్ ఫలితాల్లో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి
Вставка
- Опубліковано 18 кві 2024
- యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టి బిడ్డ మెరిసిపోయింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది.
పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులత పెద్ద కూతురు అనన్య రెడ్డి. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చదువుతూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుని సివిల్స్ లో ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. పాలమూరు బిడ్డ దేశ స్థాయిలో ర్యాంక్ సాధించడంతో పాలమూరు నగర ప్రజలు ఎంతో ఆనందంలో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు.