భూమిమీద మాయా ప్రభావం ఎలా ఉంటుంది ? in telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • How about Magical influence on earth 🌎
    For more information about meditation click this link. video • ఈ ప్రపంచంలోనే ధ్యానం గ...

КОМЕНТАРІ • 13

  • @JhansiLakshmi-bn3kp
    @JhansiLakshmi-bn3kp 3 місяці тому +3

    మహా ను భావుల వారి కి అనంత కోటి ఆత్మ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @madhumadhavi1341
    @madhumadhavi1341 3 місяці тому +2

    జై జై భగవద్గీత 🙏🙏
    గుణములే గుణములను కలిగిస్తున్నాయి ,తప్ప వేరుగా కర్త ఎవ్వరూ లేరు అని మనస్పూర్తిగా నమ్ముతున్నాము🙏🙏

  • @sirishakarnam
    @sirishakarnam 3 місяці тому +2

    Chaala chakkaga vivirichaaru..Sir..Om Sri maatre namaha 🙏🙏

  • @Nagarjuna38093
    @Nagarjuna38093 3 місяці тому +1

    Thanks sir.

  • @narayanbyregowda.6277
    @narayanbyregowda.6277 3 місяці тому +1

    👌🌹🙏

  • @narojusridhar3520
    @narojusridhar3520 3 місяці тому +1

    🙏🙏🙏

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 місяці тому +1

    .
    (2 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ) (3)భూమిమీద కొందరు గురువులుగ బయలుదేరి జ్ఞానమును బోధించుట, ఉపదేశములు ఇచ్చుట జరుగుచున్న పనియే. మాయ వారి మీదనే దృష్ఠిని సారించి, వారిని మంచి జ్ఞానులుగ బయటికి కనిపించునట్లు చేసి, వారిని చాలామంది ప్రజలు ఆశ్రయించునట్లు చేసి, ఆ గురువులు చెప్పిన విషయములు బాగా వినునట్లు చేయుచుండును. అంతేకాక బోధించునదంతయు పరమాత్మ జ్ఞానము ధర్మమేనన్నట్లు, జ్ఞానము దేవుడు అను పదములుపయోగించుచు, ఎంతో ఆకర్షణీయమైన బోధలు చేయుచుండును. ఆ బోధలలో ఒక్క శాతము దైవజ్ఞానము ఉండగ 99% మాయకు సంబంధించిన జ్ఞానమే ఇమిడివుండును. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికి, ఇది మాయకు సంబంధించిన జ్ఞానమని, పరమాత్మలోనికి ఐక్యము చేయునదికాదని ఎవరూ గుర్తించలేరు. అదియే మాయయొక్క గొప్పతనము. ఎంతో పెద్ద ఆధ్యాత్మిక గురువున్నప్పటికి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికమును బోధిస్తున్నప్పటికి వారియందు కూడ చివరికు 95% దైవధర్మములేని మాయ యొక్క బోధయేవుండును. ఇలా కనిపించు గురువులలో కూడ ఉండి వారిచేతనే దైవజ్ఞానమన్నట్లు దైవధర్మములన్నట్లు అధర్మములను బోధిస్తుండుట వలన, దేవుని తెలుసుకోవాలనుకొనువారు కూడ మాయలోనే చిక్కుకొని పరమాత్మవైపు ప్రయాణించలేకున్నారు. ఉన్న కోట్ల ప్రజలలో వేలసంఖ్యలో కొందరికి మాత్రమే జ్ఞానము మీద ఇచ్ఛ కలుగగా, వారిని కూడ మాయ గురువులరూపములో బోధిస్తూనే తన వైపుకు లాగుకొనుచున్నది. కావున గీత విజ్ఞానయోగములో మోక్షము కోరువారిలో చివరకు ఎవరో నన్ను తెలుసుకోగలిగేది అన్నాడు. మాయ అనేక స్థాయిలలో రకరకముల గురువులను ఆవహించి ఉండుట వలన, జ్ఞానము కోరువారు ఏదో ఒక గురువును ఆశ్రయించి మాయ ఆవరణములోనే చేరి పోవుచున్నారు. అందువలన నిజమైన పరమాత్మ జ్ఞానము దొరకాలంటే అనేక జన్మల సంస్కారము వలననే లభించునని గీతయందన్నాడు. అనేక అంటే వందలు కావచ్చు, వేలు కావచ్చు. ఇక్కడ కొందరికొక అనుమానమురావచ్చును. అది ఏమనగా! గురువులందరిని మాయ మభ్యపెట్టి భ్రమింపజేసి, తన బోధనే బోధిస్తున్నదన్నప్పుడు, ఎవరూ పరమాత్మ జ్ఞానము బోధించువారే లేరని చెప్పినపుడు, అనేక జన్మల తర్వాతైన వారికి పరమాత్మ జ్ఞానమెట్లు లభించును అని అడుగవచ్చును. దానికి మా సమాధానము పరమాత్మ యొక్క జ్ఞాన ధర్మములను నూటికి నూరుపాళ్ళు బోధించు గురువులు భూమిమీద ఉంటే పరమాత్మ పుట్టవలసిన అవసరమే లేదుకదా! అలా తన ధర్మములు తెలిసి బోధించువారు లేని దానివలన, పరమాత్మయే స్వయముగ భూమిమీద పుట్టి బోధించవలసి వస్తున్నది. అందువలన ధర్మములకు గ్లాని ఏర్పడినపుడు నేను జన్మించి, నా ధర్మములను తెలియజేస్తానని గీతయందు చెప్పాడు.
    దైవధర్మముల తరుపున పరమాత్మయే స్వయముగ ఉద్భవించి, తన ధర్మములను పూర్తిగ తెలుపుటవలన మాయకు ఇబ్బంది ఏర్పడి, గురువుల మీదనే తన పట్టు తప్పిపోవు పరిస్థితి ఏర్పడును. కనుక అటువంటి పరిస్థితి రాకుండ మాయ కూడ స్వయముగ జన్మ ఎత్తి, భగవంతునికంటే గొప్పగ కనిపించి, తనే భగవంతుడనని పేరుగాంచుచుండును. మాయ అవతార భగవంతుని ముందర అసలైన పరమాత్మ అవతారము కూడ తక్కువుగా ఉండును. అందువలన నిజమైన భగవంతుని జ్ఞానులు సహితము గుర్తించలేరు. కాని మాయా భగవంతుని అజ్ఞానులు సహితము గుర్తించగలరు. భూమి మీద ధర్మములు తెలియనపుడు, అనేక జన్మ సంస్కారపరులకు ధర్మములు అవసరమైనపుడు, వేల సంవత్సరములకో లేక లక్షల సంవత్సరములకో పరమాత్మ జన్మము ఎత్తవలసి వస్తున్నది. మాయ మాత్రము పరమాత్మ జన్మకు ముందు వెనుక అవతారమెత్తడమేకాక, పరమాత్మ భగవంతునిగ జన్మించినపుడు తాను కూడ మూడు నాలుగు చోట్ల జన్మించి, అందరిని తనవైపు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించును. పరమాత్మ భగవంతునిగా ఏ దేశములో పుట్టునో మాయ కూడ అదే దేశములో పుట్టుచున్నది. పరమాత్మ ఏ ప్రదేశములో పుట్టునో, ఆ ప్రదేశమునకు చుట్టు ప్రక్కల మాయ మూడు లేక నాలుగు జన్మలు కలిగివుండును. పరమాత్మ కేవలము జ్ఞాన ధర్మములనే బోధించగ, మాయకూడ ధర్మములులేని ఆధ్యాత్మికమునే ఆకర్షణీయముగ చెప్పుచుండును.
    (తర్వాత 4 వ కామెంట్లో కంటిన్యూ అయింది)

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 місяці тому +1

    భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గుణాలే నేను సృష్టించిన నా మాయ అని చెప్పారు.
    విజ్ఞాన యోగము
    శ్లో|| 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
    మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||
    (పరమాత్మ)
    భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
    వివరము: ఆదికర్త అయిన పరమాత్మ సర్వజగత్ కంతటికి అధిపతియై, సర్వమును తానే సృష్ఠించి అవి అన్ని నడుచుటకు కావలసిన పద్దతిని ఏర్పరిచాడు. తాను ఏర్పరిచిన పద్ధతికి సమస్తము కట్టుబడి ఉండునట్లు చేశాడు. సర్వప్రపంచమునకు తానే సృష్ఠికర్త, అధిపతియైనప్పటికి ప్రపంచముతో తాను ఏమాత్రము జోక్యము చేసుకోక, బంధము పెట్టుకోక, తాను నిర్మించిన పద్ధతిచే నడుచునట్లు నిర్మాణము చేశాడు. తాను నిర్మించిన పద్ధతికి సమస్తము ఆధీనమైయుండి, ఆ పద్ధతి ప్రకారమే నడుచుకొనుచున్నవి. ఈ లెక్క ప్రకారము సర్వప్రపంచమును ఆధీనపరుచుకొని ఆడించుచున్నది స్వయముగా పరమాత్మగాదు. పరమాత్మచే నిర్మింపబడిన ప్రత్యేకమైన విధానము. ఆ విధానమునకు లేక పద్ధతికి ముఖ్యమైన పేరు గలదు. దానినే మాయ అనుచున్నాము. మాయకు మరికొన్ని పేర్లు గలవు. ఏసుప్రభువు దానికి సాతాన్ అని పేరు పెట్టగ, ఇస్లాం ప్రవక్త సైతాన్ అను పేరుతో పిలిచాడు. పరమాత్మ నిర్మించినది మాయ కావున ఈ శ్లోకములో 'దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా' అని అన్నాడు.
    మాయ పరమాత్మచే నిర్మింపబడి ఆయన మొదట చెప్పిన ఆదేశానుసారము తన పనిని తాను చేస్తూపోతున్నది. ప్రపంచములో మాయకు లోబడనిది ఏదీలేదు. పుట్టినవన్నియు మాయకు లోబడిఉన్నాయి. మాయకు లోబడనిది మాయనే పుట్టించిన పరమాత్మ ఒక్కటే. మాయపద్ధతి ప్రకారము తన ఆధీనములో ఉండు వారిని సాధారణముగ నడిపించుచుండును. అలాకాక తనకు వ్యతిరేఖముగ నడువవలెననుకొను వారికి పూర్తి విరుద్ధముగ చేయుటకు ప్రయత్నించును. ప్రకృతిసిద్ధమైన జననము మరణము నుండి తప్పించుకోవలెనను వారందరు మాయ ఆధీనమునుండి తప్పించుకోవలెననుకొనెడివారే. కనుక మాయకు ముక్తి కావలెననువారు వ్యతిరిక్తులు, ముక్తి కావలెననుకొనువారికి మాయ వ్యతిరిక్తము. ముక్తికావలెను అనుకొనువాడు ప్రపంచాధినేతయైన మాయను ఏమిచేయలేడు. కాని మాయ అనుకొంటే ఎవరినైన ఏమైన చేయగలదు. దానిని జయించవలెనంటే దుస్సాధ్యముగా ఉండును. అందువలన 'మమమాయా దురత్యయా' అని పై శ్లోకములో చెప్పారు. అట్లయిన మోక్షమును ఎవరూ పొందలేరుకదాయను ప్రశ్నకూడ రాగలదు.