అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని దశావతారునిగా... "పాటించి నాలో నుండి పలికింతువు నీవు" అను పదంతో.. "నానాలిక పైనుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను బొగడించితివి"...దాచుకో దాచుకో అంటూనే... శాంతి,వైరాగ్యం, గురుసేవ, సత్యం, ధర్మం అహింసలే ఆయుధాలుగా కలవారికెట్టి యిక్కట్టులు లేవనుచూ... ఈ క్రింది కీర్తనను ముఖారి రాగంలో వ్రాసి స్వరయుక్తంగా పాడి వినించినట్లు టిటిడి దేవస్థానం అన్నమయ్య అరలోని చరిత్ర పుటలు..చెబుతున్నాయి... దేవ నీవు గల్పించిన తెరువులివి నీవారైన వారి నేరుపులివి.. పల్లవి పరమ శాంతునకు బాపము రాదు విరతి గలవానికి వెరపు లేదు, గురు సేవారతునకు గోపము రాదు ధర సత్య విదునకు దప్పులేదు.. .. దేవ.. పుట్టు బ్రహ్మ చారికి బుద్ధి చెడదు అట్టే ఆసలేని వారికి అలపులేదు, తొట్టిన సుజ్ఞానికి దుఃఖము లేదు గట్టియైన మౌనికి కలహమే లేదు.. .. దేవ ... సమ చిత్తునకును చంచలము గాదు విమలాచారునకు వెలితి లేదు, నెమకి శ్రీ వేంకటేశ నీ దాసులై కొల్చి భ్రమయని వారికి భారము లేదు.. ..దేవ.. తత్సమాన భగవద్గీత వచనం.. శ్లోకం.. అమానిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్ణవం | ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః || తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస,క్షమించు గుణము,మనో వాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట,బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము,మనశ్శరీరియేంద్రియ నిగ్రహము మొదలగు గుణములు గలవారు.. రెండు లేదా అంతకంటె ఎక్కువ అక్రరాలు సమూహంగా ఉంటే వాటిని పదములు లేదా మాటలు అంటారు. అన్నమయ్య యెక్క ప్రతి కీర్తన లోని రెండులేక మూడు అక్షరాల పదాలను తీసుకొని ఆ పదాల మాటున దాగియన్న అనేక కీర్తనలను వెలికి తీయవచ్చు. ఉదా: ధర; జయ జయ రామ సమర విజయ రామ.. ..ధర అహల్య పాలిటి అయోధ్య రామ! ఉదా: సమ., సమ బుద్ధే యిందరికీ సర్వ వేదసారము సముడిందరికీ సాధనమో హరియయ్యా.. ఇదీ ఈరోజు నా అన్నమయ్య కీర్తన వ్యాసంగం. నమో వేంకటేశాయ మంగళమ్.❤❤❤
Good. Guests.🙏🏼🍀💐🌼☘️
Super explanation
True comments all speakers.
అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని దశావతారునిగా...
"పాటించి నాలో నుండి పలికింతువు నీవు" అను పదంతో..
"నానాలిక పైనుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్ను బొగడించితివి"...దాచుకో దాచుకో అంటూనే...
శాంతి,వైరాగ్యం, గురుసేవ, సత్యం, ధర్మం అహింసలే ఆయుధాలుగా కలవారికెట్టి యిక్కట్టులు లేవనుచూ...
ఈ క్రింది కీర్తనను ముఖారి రాగంలో వ్రాసి స్వరయుక్తంగా పాడి వినించినట్లు టిటిడి దేవస్థానం అన్నమయ్య అరలోని చరిత్ర పుటలు..చెబుతున్నాయి...
దేవ నీవు గల్పించిన తెరువులివి
నీవారైన వారి నేరుపులివి.. పల్లవి
పరమ శాంతునకు బాపము రాదు
విరతి గలవానికి వెరపు లేదు,
గురు సేవారతునకు గోపము రాదు
ధర సత్య విదునకు దప్పులేదు.. .. దేవ..
పుట్టు బ్రహ్మ చారికి బుద్ధి చెడదు
అట్టే ఆసలేని వారికి అలపులేదు,
తొట్టిన సుజ్ఞానికి దుఃఖము లేదు
గట్టియైన మౌనికి కలహమే లేదు.. .. దేవ ...
సమ చిత్తునకును చంచలము గాదు
విమలాచారునకు వెలితి లేదు,
నెమకి శ్రీ వేంకటేశ నీ దాసులై కొల్చి
భ్రమయని వారికి భారము లేదు.. ..దేవ..
తత్సమాన భగవద్గీత వచనం.. శ్లోకం..
అమానిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్ణవం |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ||
తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస,క్షమించు గుణము,మనో వాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట,బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము,మనశ్శరీరియేంద్రియ నిగ్రహము మొదలగు గుణములు గలవారు..
రెండు లేదా అంతకంటె ఎక్కువ అక్రరాలు సమూహంగా ఉంటే వాటిని పదములు లేదా మాటలు అంటారు.
అన్నమయ్య యెక్క ప్రతి కీర్తన లోని రెండులేక మూడు అక్షరాల పదాలను తీసుకొని ఆ పదాల మాటున దాగియన్న అనేక కీర్తనలను వెలికి తీయవచ్చు.
ఉదా: ధర;
జయ జయ రామ సమర విజయ రామ..
..ధర అహల్య పాలిటి అయోధ్య రామ!
ఉదా: సమ.,
సమ బుద్ధే యిందరికీ సర్వ వేదసారము
సముడిందరికీ సాధనమో హరియయ్యా..
ఇదీ ఈరోజు నా అన్నమయ్య కీర్తన వ్యాసంగం.
నమో వేంకటేశాయ మంగళమ్.❤❤❤
Jai CBN sir
ప్రస్తుత ఎ.పి. పరిస్థితులలో పరిపాలన కత్తిమీద సాము..వంటిది..
"పాలింప నాతడే గాక పరులకు వశమా!"..అని అన్నమయ్య ❤❤❤
Appudu 151 ycp ki vachinappudu dusta sikhana sista rakshana ne kada...siggu vundaali matladadaniki..votes kaadu evms tampering baaga jarigindhi
Same logic prakaram 2019 lo kuda tampering jariginda?