మధురా నగరి వీధుల్లో నడుస్తున్న కృష్ణ పరమాత్మ ను ధ్యానించటం ఒక ఉపాసన,మానసిక పూజ అని వ్యాసుడు వివరిస్తున్నాడు.కృష్ణ ఉపచార వైభవం,కృష్ణ పూజ అంతా మధురా నగరిలో కనిపిస్తుంది. మధురావీధి చరం భజామహే అని అంటాడు లీలాశుకుడు.వేద పండితుడు కాకపోయినా ఒక వృత్తి కళాకారుడు,మాలాకారుడు అయిన సుదాముడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు శ్రీ కృష్ణ పరమాత్మ. తలుపు తెరచి ఆశ్చర్యచకితుడైనాడు సుదాముడు.కృష్ణ కథలు చిన్నప్పుడు వినగానే పరమాత్మ అని ధృడపడిపోయి,ఎన్నో జన్మల పుణ్య ఫలంగా ఏ మూర్తిని తాను నిరంతరం ధ్యానిస్తూ కొలుచుకుంటున్నాడో ఆ దైవం తన ఎదురుగా వున్నాడు అని ఆనంద పరవశుడైనాడు. రోజూ అందమైన పూలు అన్నీ తీసి ఒక దండగా కట్టి అక్కడ వున్న కృష్ణ పరమాత్మ విగ్రహానికి వేసి దణ్ణం పెట్టుకునే వాడు.అలాంటిది ఇవాళ స్వామి మందహాసం చేస్తూ లోపలికి రాగానే స్వామి కి ఆసనం ఇచ్చి ఈ మాల నీకే స్వామి అంటూ స్వామి మెడలో వేశాడు ప్రేమగా.స్వామికి అన్ని ఉపచారములు చేసి స్వామి నేడు నువ్వు అడుగు పెట్టడం వలన దేవతలు,పితృదేవతలు,మహర్షులు నా పట్ల ప్రసన్నులయ్యారు అని ఆనందపరవశుడైనాడు. సుదాముని భక్తి కి ప్రసన్నుడైన కృష్ణ పరమాత్మ నీకేమి కావాలో కోరుకో అని అడుగగా సుదాముడు ఈవిధంగా స్వామి తో అంటున్నాడు. "నీ పాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును దాపసమందార! నాకు దయచేయఁ గదే!" త్యాగయ్య కూడా భక్తి బిచ్చమీయవయ్యా రామయ్యా అని అడుగుతాడు.భక్తి వుంది కనుకనే యింకా భక్తి కావాలని అడిగాడు.ఇక్కడ సుదాముడు 3 కోరికలు అడిగాడు. 1. ఓ వాసుదేవా సర్వ జీవుల యందు ఆత్మగా వున్న నీయందు నాకు భక్తి కలగాలి. 2.నీ భక్తుల సాంగత్యం వలన నిరంతర భక్తి వృద్ధి చెంది పురోగతిని చేస్తుంది కావున సత్ సాంగత్యాన్ని ఇవ్వు. భగవత్ భక్తులతో కలసి తిరుగుతూ వుంటే వాళ్ళు సాలోక్య ముక్తిని పొందినట్లే అని శివానంద లహరి లో శంకరభగవత్పాదులు అన్నారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమసిధ్దమత్రభవతి స్వామిన్ కృతార్థోஉస్మి అహమ్ 3.సర్వ భూతముల యందు ప్రేమ దయ కలిగి వుండాలి అని, ఇది అచ్చమైన హిందువు హృదయం ఇది ఒక్క హిందువు మాత్రమే అనగలడు. ఈ మూడు కోరికలు అడిగాడు సుదాముడు. ఒక భక్తుడు అంటాడు నన్ను అగ్ని పంజరంలో వుంచినా భరించగలను కానీ నాస్తికులతో సాంగత్యం వద్దు అని అంటాడు. ఎందుకంటే వారు భ్రష్ట జాతి,మూర్ఖులు కనుక.నాలిక లేదు అని నాలుకతో అన్నట్లుగా దేవుడు లేడు అని దేవుడిచ్చిన శక్తి తోనే అంటారు. సుదాముడు మూడు కోరికలే అడిగినా,స్వామి ఆ మూడు వరాలు ఇచ్చి వాటితో పాటు తర తరాలుగా వృద్ధి చెందే సంపద,బలము,ఆయుష్షు, యశస్సు,కాంతి,అష్ట సిద్ధులూ యిచ్చాడు సుదాముడికి.తాగయ్య తులసీ దళములచే సంతోషముగా పూజింతు అన్నట్లుగా మనందరికీ అంతటి భక్తి మన గురుదేవుల దయ వలన కలగాలని కోరుకుంటూ ఈ కీర్తనలను ఆస్వాదిద్దాము gurujnanam.org
భక్తి బిచ్చమియ్యవే భావుకమగు సాత్వీక 1.ముక్తికఖిల శక్తికి త్రిమూర్తులకతి మేల్మి రామ 2.ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ
naturality in singing....luv it....
Amazing fluency and bhava
మధురా నగరి వీధుల్లో నడుస్తున్న కృష్ణ పరమాత్మ ను ధ్యానించటం ఒక ఉపాసన,మానసిక పూజ అని వ్యాసుడు వివరిస్తున్నాడు.కృష్ణ ఉపచార వైభవం,కృష్ణ పూజ అంతా మధురా నగరిలో కనిపిస్తుంది.
మధురావీధి చరం భజామహే అని అంటాడు లీలాశుకుడు.వేద పండితుడు కాకపోయినా ఒక వృత్తి కళాకారుడు,మాలాకారుడు అయిన సుదాముడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు శ్రీ కృష్ణ పరమాత్మ.
తలుపు తెరచి ఆశ్చర్యచకితుడైనాడు సుదాముడు.కృష్ణ కథలు చిన్నప్పుడు వినగానే పరమాత్మ అని ధృడపడిపోయి,ఎన్నో జన్మల పుణ్య ఫలంగా ఏ మూర్తిని తాను నిరంతరం ధ్యానిస్తూ కొలుచుకుంటున్నాడో ఆ దైవం తన ఎదురుగా వున్నాడు అని ఆనంద పరవశుడైనాడు. రోజూ అందమైన పూలు అన్నీ తీసి ఒక దండగా కట్టి అక్కడ వున్న కృష్ణ పరమాత్మ విగ్రహానికి వేసి దణ్ణం పెట్టుకునే వాడు.అలాంటిది ఇవాళ స్వామి మందహాసం చేస్తూ లోపలికి రాగానే స్వామి కి ఆసనం ఇచ్చి ఈ మాల నీకే స్వామి అంటూ స్వామి మెడలో వేశాడు ప్రేమగా.స్వామికి అన్ని ఉపచారములు చేసి స్వామి నేడు నువ్వు అడుగు పెట్టడం వలన దేవతలు,పితృదేవతలు,మహర్షులు నా పట్ల ప్రసన్నులయ్యారు అని ఆనందపరవశుడైనాడు. సుదాముని భక్తి కి ప్రసన్నుడైన కృష్ణ పరమాత్మ నీకేమి కావాలో కోరుకో అని అడుగగా సుదాముడు ఈవిధంగా స్వామి తో అంటున్నాడు.
"నీ పాదకమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయచేయఁ గదే!"
త్యాగయ్య కూడా భక్తి బిచ్చమీయవయ్యా రామయ్యా అని అడుగుతాడు.భక్తి వుంది కనుకనే యింకా భక్తి కావాలని అడిగాడు.ఇక్కడ సుదాముడు 3 కోరికలు అడిగాడు.
1. ఓ వాసుదేవా సర్వ జీవుల యందు ఆత్మగా వున్న నీయందు నాకు భక్తి కలగాలి.
2.నీ భక్తుల సాంగత్యం వలన నిరంతర భక్తి వృద్ధి చెంది పురోగతిని చేస్తుంది కావున సత్ సాంగత్యాన్ని ఇవ్వు. భగవత్ భక్తులతో కలసి తిరుగుతూ వుంటే వాళ్ళు సాలోక్య ముక్తిని పొందినట్లే అని
శివానంద లహరి లో శంకరభగవత్పాదులు అన్నారు.
సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమసిధ్దమత్రభవతి స్వామిన్ కృతార్థోஉస్మి అహమ్
3.సర్వ భూతముల యందు ప్రేమ దయ కలిగి వుండాలి అని, ఇది అచ్చమైన హిందువు హృదయం ఇది ఒక్క హిందువు మాత్రమే అనగలడు. ఈ మూడు కోరికలు అడిగాడు సుదాముడు.
ఒక భక్తుడు అంటాడు నన్ను అగ్ని పంజరంలో వుంచినా భరించగలను కానీ నాస్తికులతో సాంగత్యం వద్దు అని అంటాడు. ఎందుకంటే వారు భ్రష్ట జాతి,మూర్ఖులు కనుక.నాలిక లేదు అని నాలుకతో అన్నట్లుగా దేవుడు లేడు అని దేవుడిచ్చిన శక్తి తోనే అంటారు. సుదాముడు మూడు కోరికలే అడిగినా,స్వామి ఆ మూడు వరాలు ఇచ్చి వాటితో పాటు తర తరాలుగా వృద్ధి చెందే సంపద,బలము,ఆయుష్షు, యశస్సు,కాంతి,అష్ట సిద్ధులూ యిచ్చాడు సుదాముడికి.తాగయ్య తులసీ దళములచే సంతోషముగా పూజింతు అన్నట్లుగా మనందరికీ అంతటి భక్తి మన గురుదేవుల దయ వలన కలగాలని కోరుకుంటూ ఈ కీర్తనలను ఆస్వాదిద్దాము
gurujnanam.org
🙏🙏🙏
pallavi
1bhakti 2biccam(i)yyavE
bhAvukamagu 3sAtvIka (bha)
anupallavi
4muktik(5a)khila Saktiki tri-
mUrtulak(a)ti mElmi 6rAma (bha)
caraNam
prANamu lEni vAniki bangAru 7pAga cuTTi
ANi vajra bhUshaNam(u)ramandu peTTu rIti
8jANalaku purAN(A)gama SAstra vEda japa prasanga
trANa kalgi(y)Emi bhakta tyAgarAja nuta 9rAma (bha)
భక్తి బిచ్చమియ్యవే
భావుకమగు సాత్వీక
1.ముక్తికఖిల శక్తికి
త్రిమూర్తులకతి మేల్మి రామ
2.ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ
Elegant and emotion laden rendering